జనవరి 1 నుంచి సిమ్‌ కార్డుల జారీకి కొత్త రూల్‌

07 December 2023

ఇకనుంచి స్మార్ట్ ఫోన్ లో ఉపయోగించే సిమ్‌ కార్డుల జారీకి సంబంధించి కొత్త రూల్ త్వరలో అమల్లోకి రానుంది.

ఇప్పటి వరకు అనుసరిస్తున్న పేపర్‌ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్‌ విధానాన్ని టెలికాం విభాగం నిలిపివేసింది.

దీని స్థానంలో జనవరి 1 నుంచి డిజిటల్‌ వెరిఫికేషన్‌ను తీసుకొస్తోంది. దీనివల్ల సిమ్‌ కార్డుల మోసాలను సైతం అరికట్టొచ్చని కేంద్రం భావిస్తోంది.

ప్రస్తుతం సిమ్‌ కార్డుల జారీ కోసం ఫారం నింపాల్సి ఉంటుంది. దీనికి గుర్తింపు పత్రాలు, ఫొటోలు జత చేయాలి.

కొన్ని కంపెనీలు మాత్రం ఇప్పటికే డిజిటల్‌ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇకపై పూర్తి స్థాయిలో డిజిటల్‌గా మార్చనున్నారు.

డాట్‌ తీసుకున్న ఈ తాజా నిర్ణయం కారణం దేశంలో టెలికాం కంపెనీలకు, వినియోగదారులకు ఎన్నో విధాలుగా మేలు జరగనుంది.

పేపర్‌ లెస్‌ విధానం వల్ల కస్టమర్‌ను చేర్చుకునేందుకు ఆయా కంపెనీలకు అయ్యే ఖర్చు తగ్గుతుందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.

ఇకపై ఆయా కంపెనీలు ఇకపై పూర్తిగా మొబైల్‌ ద్వారానే ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అలాగే సిమ్‌ కార్డు మోసాలు సైతం అరికట్టొచ్చని కేంద్రం భావిస్తోంది.