కొత్త కారు కొనేవారు ముందుగా ఇదే చెక్ చేస్తారట..!

కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.

అయితే, చాలా మంది ప్రజలు ముందుగా మైలేజ్ అంశాన్నే చెక్ చేస్తారని అంతా అనుకుంటారు.

కానీ, తాజాగా స్కోడా ఆటో ఇండియా జరిపిన అధ్యయనంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు చెక్ చేసే మొదటి అంశం సెఫ్టీ ఫీచర్స్.

క్రాష్ రేటింగ్, ఎయిర్‌బ్యాగ్‌ల అంశాన్ని ఎక్కువగా పరిశీలిస్తారట.

10 మందిలో 9 మంది ఈ సెక్యూరిటీ ఫీచర్స్, మోడల్స్‌ని చెక్ చేస్తున్నట్లు గుర్తించారు.

సెక్యూరిటీ ఫీచర్స్ తరువాత మైలేజ్ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు.

ఈ అధ్యయనంలో దేశంలోని 10 రాష్ట్రాలకు చెందిన 1,000 మంది పాల్గొని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.