BSNL లోగో మారింది..!

TV9 Telugu

24 October 2024

భారతీయ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు మరింత పాపులర్ అవుతోంది. గతంలో వెలుగు వెలిగి పడిపోయిన ఇప్పుడు ఒక్కసారిగా లేచింది.

దేశంలో ప్రైవేట్‌ టెలికాం సంస్థలు టారీఫ్‌ ప్లాన్స్‌ పెంచినా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం ఎలాంటి ధరలు పెంచలేదు.

దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది నెట్వర్క్ వినియోగదారులు తమ నంబర్లను బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ పెట్టుకుంటున్నారు.

భారతదేశంలో సొంత టెక్నాలజీతో 4జీ సేవలు అందుంబాటులోకి తీసుకువచ్చేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రయత్నాలు ముమ్మరం.

వచ్చే ఏడాదిలో దేశ వ్యాప్తంగా అమలు అయ్యేలా వేగంగా అడుగులు. దీని కోసం బాగా కష్టపడుతున్నారు బిఎస్ఎన్ఎల్ అధికారులు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ లోగోలో మార్పులు.. లోగోలో కాషాయం, తెలుపు, గ్రీన్‌ కలర్స్‌తో లోగోను రూపొందించింది.

కొత్తగా 5జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న కంపెనీ లోగోలో రంగుల్లో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం.

ప్రస్తుతం భారతదేశంలోని ఎంపిక చేసిన సర్కిల్స్‌లో 4 సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ.