రీఛార్జ్ చేయకపోతే ఎన్ని రోజులకు సిమ్ నంబర్ మరొకరికి బదిలీ చేస్తారు..?

TV9 Telugu

09 February 2024

ప్రస్తుతకాలంలో చాలా మంది తమ మొబైల్ లో డ్యుయల్ సిమ్ ఉపయోగించడం సర్వసాధారణంగా మారిపోయిందిని తెలిసిన విషయమే.

ప్రస్తుతం ఒక్కొక్కరి వద్ద డబుల్ సిమ్స్ ఉంటాయి. కొంతమంది అయితే మూడు లేదా నాలుగు సిమ్‌లు కూడా వాడుతున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో ఉంచిన సిమ్‌ని రీఛార్జ్ చేయరు. ఇలా రీఛార్జ్ చేయకుండా సిమ్ వదిలేస్తే కంపెనీ బ్లాక్ చేస్తుంది.

టెలికాం నియమం ప్రకారం, నిర్దిష్ట వ్యవధిలోపు సిమ్ రీఛార్జ్ చేయకపోతే, ఆ నంబర్ మరొక వ్యక్తికి ట్రాన్స్ ఫర్ చేస్తారు.

మీ సిమ్‌ రీఛార్జ్ చేయకుంటే ఆ నంబర్‌ను వేరొకరికి ఇవ్వడానికి ముందు కంపెనీలు అనేక దశలను పూర్తి చేస్తుంది.

ముందుగా 60 రోజుల పాటు సిమ్‌ని రీఛార్జ్ చేయనప్పుడు అది డియాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఆ తరువాత కూడా రీఛార్జ్ కోసం 6-9 నెలల గడువు ఇస్తారు.

ఈ సందర్భంలో నంబర్‌ను మళ్ళీ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా సిమ్‌ని రీఛార్జ్ చేయకుంటే అనేక హెచ్చరికల తర్వాత కంపెనీ సిమ్ బ్లాకింగ్ చేస్తుంది.

కొన్ని నెలల తర్వాత ఈ సిమ్ నంబర్ మరొక వినియోగదారుకు ట్రాన్స్ ఫర్ చేస్తారు. ఒకరి నుంచి మరొకరికి సిమ్‌ నంబర్ బదిలీ చేయడానికి ఏడాది సమయం పడుతుంది.