TV9 Telugu

భూమి నుంచి గ్రహాలు, నక్షత్రాల రంగులు చూడొచ్చు..!

01 March 2024

భూమి నుంచి గ్రహాలు కనిపిస్తాయి, నక్షత్రాల రంగులను సైతం చూడొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. అలాంటి అబ్జర్వేటరీని సీతాపూర్‌లో నిర్మిస్తున్నారు.

దేశంలోనే తొలి ఆస్ట్రో టూరిజం సెంటర్‌ను పశ్చిమ బెంగాల్‌లో నిర్మిస్తున్నారు. కోల్‌కతా నుండి 83 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతాపూర్ సమీపంలో ఉంది.

2023లో విజయవంతమైన చంద్రయాన్-3 అంతరిక్షంలోని అంతర్గత భాగాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

ఈ ఆస్ట్రో టూరిజం సెంటర్ నిర్మాణానికి రూ.3 కోట్లు కేటాయించినట్లు ఇండియన్ సెంటర్ ఫర్ స్పేస్ ఫిజిక్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ సందీప్ కుమార్ చక్రవర్తి తెలిపారు.

సీతాపూర్ నుండి ఆకాశం ఇతర నగరాల కంటే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే సీతాపూర్‌లో చీకటి ఎక్కువ.

చాలా చోట్ల పట్టణీకరణ వల్ల ఆకాశం స్పష్టంగా కనిపించడం లేదు. అందుకే సీతాపూర్‌ను ఎంచుకున్నట్లు ప్రొఫెసర్ సందీప్ తెలిపారు.

దేశంలోని రెండు పెద్ద టెలిస్కోప్‌లు సీతాపూర్‌లో ఉన్నాయి. వీటి ద్వారా చంద్రుడు వలయాలను చూడటానికి శాస్త్రవేత్తలు పర్యాటకులను అనుమతిస్తారు.

సీతాపూర్ ఆస్ట్రోటూరిజం సెంటర్‌లో పర్యాటకుల కోసం ఒక రోజు నుండి ఒక వారం వరకు కోర్సులు అందించడం జరుగుతుంది.