శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు కేంద్రం అలర్ట్‌..!

17 December 2023

శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్లలో సెక్యూరిటీ లోపాన్ని గుర్తించింది కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ. వెంటనే ఫోన్లను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.

ఆండ్రాయిడ్‌ 11, 12, 13, 14 ఓఎస్‌తో పనిచేసే శాంసంగ్‌ ఫోన్లలో భద్రతాపరమైన లోపం కారణంగా వ్యక్తులకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను హ్యాకర్లు చోరీ చేసే ప్రమాదం పొంచి ఉంది.

స్మార్ట్‌ఫోన్‌ను లేటెస్ట్‌ సెక్యూరిటీకి అప్‌డేట్‌ చేసుకోవాలని ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన సెర్ట్‌ ఇన్‌ (CERT-In) సూచించింది.

నాక్స్ ఫీచర్లపై కంట్రోలింగ్ లేకపోవడం, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు, ఏఆర్‌ ఎమోజీ యాప్‌లో ఆథరైజేషన్ సమస్యలు ఉన్నాయి.

వీటితో పాటు నాక్స్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను సరిదిద్దకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తింది.

ఫోన్‌లో ఈ లోపాల కారణంగా అటాకర్లు భద్రతాపరమైన అడ్డంకులు అధిమించి సమాచారాన్ని దొంగలించే ప్రమాదం పొంచి ఉంది.

లోపాలను గుర్తించి చొరబడితే డివైజ్‌ పిన్‌ను, ఏఆర్‌ ఎమోజీ సాండ్‌బాక్స్‌ డేటాను అటాకర్లు రీడ్‌ చేయవచ్చు.

సిస్టమ్‌ టైమ్‌ను మార్చి నాక్స్‌ గార్డ్‌ లాక్‌ను బైపాస్‌ చేసి అర్బిట్రరీ ఫైల్స్‌, సున్నితమైన సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉందని సెర్ట్‌-ఇన్‌ పేర్కొంది.