T20 world Cup 2022 : తొలి మ్యాచ్ పాకిస్తాన్ తోనే.. టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే..

ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ 2022 కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.

ఈ జట్టులో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ చోటు దక్కించుకున్నాడు.

టీ20 ప్రపంచకప్‌నకు 15 మంది సభ్యులతో కూడిన జట్టులో ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, దీపక్ చాహర్‌లకు చోటు కల్పించలేదు.

భారత జట్టు తొలి మ్యాచ్ లో పాకిస్తాన్‌తో అక్టోబర్ 23న తలపడనుంది.

టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ షెడ్యూల్..

అక్టోబరు 23 - భారత్ v పాకిస్థాన్, మెల్బోర్న్, మధ్యాహ్నం 1.30లకు

27 అక్టోబర్ - భారతదేశం v A2, సిడ్నీ, మధ్యాహ్నం 12.30లకు

అక్టోబరు 30 – భారత్ v సౌతాఫ్రికా, పెర్త్, సాయంత్రం 4.30లకు

నవంబర్ 2 - భారత్ v బంగ్లాదేశ్, అడిలైడ్, మధ్యాహ్నం 1.30లకు

భారత జట్టు: రోహిత్ శర్మ ( కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (WK), దినేష్ కార్తీక్ (WK), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్.

స్టాండ్‌బై ఆటగాళ్లు-  మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్.

ఇక్కడ క్లిక్ చేయండి