తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ తెలుగులో నేరుగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
దళపతి కెరీర్ లో 66వ చిత్రంగా రాబోతున్న సినిమాకు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
విజయ్ పుట్టిన రోజు (జూన్ 22) న ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ చేశారు
విజయ్, వంశీల కలయికలో రాబోతున్న ఈ చిత్రానికి 'వరిసు' టైటిల్ ఫిక్స్ చేశారు..