సౌత్‌ సినిమా ఇండస్ట్రీపై సొట్టబుగ్గల సుందరి తాప్సీ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసింది.

దక్షిణాది సినిమాల్లో నటించడం వల్ల తను గుర్తింపు రాలేదని చెప్పింది.

నటిగా తనను తాను నిరూపించుకోవడానికి సరైన పాత్రలు సౌత్‌లో రాలేదని తెలిపింది.

అక్కడ స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగినప్పటికీ సంతృప్తిని ఇచ్చే క్యారెక్టర్స్‌ లభించలేదని చెప్పింది.

బాలీవుడ్‌లో నటించిన ‘పింక్‌’ చిత్రం తనకెంతో గుర్తింపుని తెచ్చిపెట్టిందని వెల్లడించింది.

ఈ సినిమా తర్వాత తన జీవితం మలుపు తిరిగిందని తాప్సీ చెప్పుకొచ్చింది.

తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలపై దక్షిణాది సినీ ప్రేక్షకులు, నెటిజన్స్‌ మండిపడుతున్నారు.

 టాలీవుడ్‌లో గుర్తింపు వచ్చింది కాబట్టే బాలీవుడ్‌ ఆఫర్స్‌ వచ్చాయని కామెంట్స్‌ చేస్తున్నారు.