బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించి (2020) రెండేళ్లు దాటుతోంది

ఐతే సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతికి సంబంధించిన మిస్టరీ ఇప్పటికీ వీడలేదు

ఇది ఆత్మహత్యనా..? హత్యనా..? అనే మీమాంస ఇప్పటికీ చర్చ కొనసాగుతూనే ఉంది

తాజాగా నటుడు సుశాంత్‌ సింగ్‌ది ఆత్మహత్య కాదని హత్యేనని కూపర్‌ ఆస్పత్రి సిబ్బంది సంచలన వ్యాఖ్యలు చేశారు

సుశాంత్‌ సింగ్‌ పోస్ట్‌మార్టమ్‌కు హాజరైన సిబ్బంది రూప్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ..పోస్ట్‌ మార్టమ్‌ చేసేటప్పుడు అతని శరీరం, మెడపై గాయాలున్నాయి

అధికారులు వెంటనే ఫోటోలు తీసి డెడ్‌బాడీని పోలీసులకు అప్పజెప్పాలని ఆదేశించడంతో.. ఫోటోలు మాత్రమే తీసినట్లు చెప్పుకొచ్చారు

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న తాజా వ్యాఖ్యలు

సుశాంత్‌ సింగ్‌ 2020 జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఐతే తాజాగా సుశాంత్‌ది ఆత్మహత్యకాదని, ముమ్మాటికీ హత్యేనంటూ పోస్టుమార్టం నిర్వహించిన సిబ్బంది మీడియాకు.. | Sushant Singh Rajput