‘విరూపాక్ష’గా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చారు హీరో సాయిధరమ్‌ తేజ్‌.

ఈ చిత్రం భారీ విజయం ఆయనలో ఉత్సాహాన్ని మరింత పెంచింది.

ప్రస్తుతం సముద్రఖని దర్శకత్వంలో  మామయ్య పవన్‌ కల్యాణ్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు.

దీనితోపాటు  జయంత్‌ పానుగంటి దర్శకత్వంలోనూ ఓ చిత్రం చేయాల్సి ఉంది.

ఇవన్నీ పూర్తికాక ముందే సాయితేజ్‌ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం తెలిసింది.

‘రచ్చ’, ‘బెంగాల్‌ టైగర్‌’ లాంటి మాస్‌ యాక్షన్‌ చిత్రాలతో హిట్స్ అందుకున్న సంపత్‌ నందితో ఓ చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రన్ని కూడా సంపత్‌ గత చిత్రాల్లాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్నట్లు సమాచారం.

ఇప్పటికే కథా చర్చలు పూర్తయిన ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి.