శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ఫిదా.
ఈ సినిమా ద్వారా సాయి పల్లవి హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
ఈ సినిమా సక్సెస్ తో అందుకున్న సాయి పల్లవి అనంతరం టాలీవుడ్ లో వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
నిజానికి ఈ సినిమాలో నటించాల్సింది వరుణ్ తేజ్ సాయి పల్లవి కాదని ఈయన తెలియచేశారు.
జయంత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఫిదా సినిమా గురించి కొన్ని విషయాలు తెలియజేశారు.
శేఖర్ కమ్ముల ఈ సినిమా స్టోరీ రాసి తనకు వినిపించాక తానే ప్రొడ్యూసర్గా వ్యవహరించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
ఈ సినిమాలో మహేష్ బాబు బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఇద్దరి కాంబినేషన్లో ఈ సినిమాని నిర్మించాలని భావించాము
ఇక ఈ కథ మహేష్ బాబు గారికి వినిపించినప్పుడు ఆయన కూడా చాలా ఇంప్రెస్ అయ్యారని తెలిపారు.
అయితే మహేష్ బాబు వంటి ఒక స్టార్ హీరో సినిమా చేస్తున్నారు అంటే ఆ సినిమాపై ఎన్నో అంచనాలు ఉంటాయి.
ఫిదా సినిమా ఆ అంచనాలను చేరుకుంటుందా లేదా అన్న సందేహం కలగడంతోనే ఈ సినిమా నుంచి మహేష్ తప్పుకోవడం తో వరుణ్ తేజ్ ఎంటర్ అయ్యారు.