త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్బాబు హీరోగా SSMB28 వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే
‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న మూడో చిత్రమిది
పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు
అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి పురస్కరించుకొని జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది
ఆదివారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం
ఈ మేరకు మహేష్బాబు ఫస్ట్లుక్ను విడుదల చేశారు మూవీ మేకర్స్
అందులో మిర్చి యార్డ్లో మహేష్ మాస్ లుక్తో స్టైలిష్గా నడిచొస్తూ కనిపించారు
సరికొత్త ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది