క్రికెట్‌ అభిమానులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..

TV9 Telugu

25 January 2024

క్రికెట్ కి ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్రికెట్ వస్తుంది అంటే చాలు మొబైల్స్ టీవీల్లో చూస్తూ బిజీ అయిపోతారు.

క్రికెట్ చాలామంది స్టేడియంలో చూస్తారు. ఈ రోజు (గురువారం) నుంచి హైదరాబాద్ లో టెస్ట్ క్రికెట్ మొదలైంది.

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జనవరి 25 నుంచి ఐదు రోజుల పాటు ఇండియా- ఇంగ్లండ్‌ మ్యాచ్‌ జరగనుంది.

దింతో తెలంగాణ ఆర్టీసి హైదరాబాద్ నగరం చుట్టుపక్కల నుంచే వచ్చే క్రికెట్ అభిమానులకు శుభవార్త తెలిపింది.

ఇండియా- ఇంగ్లండ్‌ టెస్ట్ మ్యాచ్‌ నేపథ్యంలో ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్‌ స్టేడియానికి 60 బస్సులను నడతుంది తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ.

ప్రతి రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే బస్సులు తిరిగి సాయంత్రం 7 గంటలకు ఉప్పల్‌ స్టేడియం నుంచి బయల్దేరతాయి.

ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకుని క్రికెట్‌ అభిమానులు మ్యాచ్‌ వీక్షించాలని టీఎస్‌ఆర్టీసీ సంస్థ కోరింది.