బ్రహ్మ పాపాన్ని కడిగిన ప్రదేశం.. తెలంగాణాలో మహా క్షేత్రం.. 

03 June 2025

Prudvi Battula 

 బ్రహ్మ వైవర్త పురాణం బ్రహ్మ పాపాన్ని కడిగిన ఒక ప్రధాన యాత్రా కేంద్రంగా తెలంగాణలోని ఈ క్షేత్రాన్ని కీర్తిస్తుంది.

గోదావరి నది దక్షిణ తీరానికి రెండు యోజనాల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో భక్త ప్రహ్లాదుడు, సృష్టి కర్త బ్రహ్మ దేవుడు తపస్సు చేశారు.

అదే లింబాద్రి గుట్ట..  ఇది తెలంగాణలో ఓ నరసింహ క్షేత్రం. ఇది నిజామాబాద్ నుంచి 53 కిలోమీటర్ల దూరంలో భీమ్‌గల్ పట్టణానికి సమీపంలో ఉంది.

శివపార్వతుల వివాహ సమయంలో బ్రహ్మ వివాహ కర్మలు చేస్తున్నప్పుడు తల్లి పార్వతి పాదాలను పొరపాటుగా చూశాడు.

ఈ చూపు వల్ల బ్రహ్మదేవుడు తన బ్రహ్మచర్యాన్ని కోల్పోయాడు, ఇది శివుడిని ఉగ్రరూపం దాల్చేలా చేసిందిని స్థల పురాణం చెబుతుంది.

అప్పుడు శివుడు బ్రహ్మ ఐదవ తలను తెంచడని పురాణం చెబుతుంది. ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి బ్రహ్మ ఈ క్షేత్రంలో తపస్సు చేశాడు.

భక్త ప్రహ్లాదుడు నరసింహ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి కొండపై తపస్సు చేశాడు. నరసింహ భగవానుడు తపస్సుతో సంతృప్తి చెందాడు.

నరసింహ స్వామిని ఇక్కడ కొలువై ఉండమని కోరగా భక్తులను అనుగ్రహించడానికి ఈ పవిత్ర కొండపై ఉండడానికి అంగీకరించాడు స్వామి.

ఇక్కడ కొలువై ఉన్న నరసింహ స్వామిని సేవించడానికి, దేవతలు ఈ పవిత్ర కొండపై రాళ్ళు, చెట్ల రూపాలను ధరించారు.