శివుడు నరికిన వినాయకుడి నిజమైన మనిషి తల ఎక్కడుందో తెలుసా.?

02 AUGUST 2023

పార్వతి దేవి స్నానం చేసిన చోటు, శివుడు కైలాసం నుంచి వచ్చి గణేశుడి తల నరికిన చోటు ఎక్కడ ఉందొ చాల మందికి తెలియదు.

ఉత్తరాఖండ్‌ లోని పాతాళ భువనేశ్వర్‌ అనే గుహా దగ్గరే ఈ కథ అంతా జరిగింది, ఈ గుహమొత్తం సున్నవు రాయితో ఉంటుంది.

ఇక్కడికి పర్యాటకులు చాలా మంది వస్తుంటారు. ఈ గుహలోకి కొద్ది దూరం మాత్రమే అనుమతి ఉంటుంది.

ఈ గుహలో భయంకరమైన పాములు, జంతువులు ఉంటాయి కాబట్టి దీని చివరి వరకు ఎలా ఉంటుందో ఎవరకి తెలియదు,

కానీ పార్వతి దేవి స్నానం చేసిన అందమైన మరియు అతి పవిత్రమైన కొలను ఈ గుహలోవలే ఉంది.

ఈ కొలను పక్కనే పార్వతిదేవి గనేషుడి బొమ్మ తయారు చేసి ప్రాణం పోసింది. పితోంఘుర్‌ జిల్లాలోని గంగోలిహత్‌ కి 148లో మీటర్ల దూరంలో..

ఈ పాతళగుహ ఉంది. కైలాసం తర్వాత శివుడి ఇష్టమైన ప్రదేశం ఇదే అని చెబుతారు. శివ పార్వతులు ఈ గుహలోనే ఎక్కువగా ఏకాంతంగా గడిపేవారుట.

ఈ గుహ లోపలికి దేవతిదేవతులు కూడా వెళ్ళలేరంట, ఆ దేవ దేవుడి అనుగ్రహం ఉంటే తప్ప లోనికి వెళ్ళలేరట.

కాని ఇదే శివ పార్యతులకు నివాస గృహమా అనే సందేహం రావొచ్చు. సృంద వురాణంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

ఆదిశంకరాచార్యులు లోనికి వెళ్ళడానికి ప్రయత్నించగా అప్పట్లో  అతీంద్రియ శక్తులు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నాయంట.

పైగా అక్కడ కిలో మీటర్లపొడువున పాములు, వింత జీవులు ప్రకాశిస్తూ కనపడతాయి అంట,

ఇది మరో లోకాన్ని తలిపించిందంట. శివుడు గణేషుడికి ఏనుగు తల పెట్టిన మరుసటి రోజు భటులకు అసలైన తల దొరికిందంట,

దాన్ని తీసుకు వచ్చి ఆ దేవ దేవుడి అనుమతితో ఆ గుహలోవల ఉన్నగుడిలో పెట్టారని స్కంద పురాణంలో ఉంది అని ఆది శంకరాచార్యులు చెప్పారు.

అంటే నిజమైన గణేపడి తల అపృడే గుహలో ఉన్నగుడిలో ఉందన్నమాట.