సీతారామం కంటే ముందుగానే తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్
హిందీ సీరియల్ కుంకుమ భాగ్య అప్పట్లో తెలుగులో డబ్ అయిన సంగతి తెలిసిందే.
అందులో కథానాయికగా చెల్లెలిగా నటించి బుల్లితెర ఆడియన్స్ ను ఆకట్టుకుంది మృణాల్.
ఆ తర్వాత బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
ఇక ఇప్పుడు తెలుగు వెండితెరపై సీతారామం సినిమాతో సందడి చేసింది.
ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సంపాందించుకుంది.
ఇందులో సీతామహాలక్ష్మీ పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది మృణాల్.