టాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సునీత.

తన మధురమైన గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే సునీతకి సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఉంది.

స్టార్‌ హీరోయిన్లకు సమానమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఏకైక సింగర్‌ సునీత. ఇక ఆమె సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటారు.

ఇదిలా ఉంటే సునీతకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇప్పటి వరకు తెర వెనక తన వాయిస్‌తో ఆకట్టుకున్న సునీత ఇప్పుడు వెండితెర ఎంట్రీకి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఆమె త్వరలో నటిగా పరిచయం కాబోతున్నట్లు సమాచారం.

ఓ స్టార్‌ హీరో చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నారట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌-సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

SSMB 28 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది.