అరివళగన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న శబ్దం చిత్రంలో ప్రముఖ తారల జాబితా పెరుగుతోంది

ఆది పినిశెట్టి హీరోగా ఈ చిత్రన్ని ఆల్ఫా ఫ్రేమ్స్‌ సంస్థ 7జీ ఫిలింస్‌ సంస్థతో కలిసి నిర్మిస్తుంది

ఈ చిత్రంలో చాలా గ్యాప్‌ తరువాత లక్ష్మీమీనన్‌ కథానాయకిగా నటిస్తున్నారు

ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా శరవేగంగా చిత్రకరణ జరుపుకుంటోంది

కాగా మూవీలో ఓ కీలక పాత్రలో అలనాటి హీరోయిన్  లైలా కనిపించనున్నట్లు ప్రకటించారు

అయితే మరో ప్రముఖ హీరోయిన్ సిమ్రాన్‌ కూడా ఈ చిత్రంలో నటించనున్నారు

తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం

సిమ్రాన్‌, లైలా  కలిసి 22 ఏళ్ల తర్వాత ముఖ్య పాత్రల్లో నటించడంతో ప్రేక్షకుల్లో శబ్దం చిత్రంపై  ఆసక్తి పెరుగుతోంది