సముద్రఖని దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే

కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది

జులై 28న విడుదల కానున్న ఈ చిత్రం చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది

ఈ మేరకు తాజాగా పవన్‌ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు మూవీ మేకర్స్

ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు సముద్రఖని

ఈ సందర్భంగా సెట్లో పవన్‌తో కలిసి ఉన్న ఓ వర్కింగ్‌ స్టిల్‌ను కూడా ఫాన్స్ తో షేర్ చేసుకున్నారు

‘‘దేవునికి ధన్యవాదాలు. కల్యాణ్‌ సర్‌ టాకీ భాగాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. జులై 28న మీ అందరినీ థియేటర్లలో కలుస్తాం’’ అని పోస్ట్ చేశారు సముద్రఖని

తమిళంలో విజయవంతమైన ‘వినోదాయ సీథం’కు రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రంలో పవన్‌ దేవునిగా కనిపించనున్నారు