సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాని, శివాత్మిక హీరోయిన్స్ గా పరిచయమైన విషయం తెలిసిందే. వీరిద్దరూ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు.

అయితే శివాని రాజశేఖర్ మాత్రం కాస్త స్పీడ్ మీద ఉందని చెప్పాలి.

ఒక వైపున సినిమాలు చేస్తూ.. మరో వైపున వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది ఈ చిన్నది.

ఇటీవల ఆమె చేసిన 'అహ నా పెళ్లంట' వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "అప్పుడే అంతా నా పెళ్లి గురించి అడుగుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది.

మా ఇంట్లో మా అమ్మానాన్నలు కూడా నా పెళ్లి గురించిన ప్రయత్నాలు ఇంకా మొదలుపెట్టలేదు.సోషల్ మీడియా వాళ్ళు మొదలు పెట్టేసారు అంటూ సెటైర్ వేసింది.