గతేడాది ‘విక్రమ్‌’తో దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌  సంచలన హిట్ అందుకున్నారు

ఆ మూవీ భాషలతో సంబంధం లేకుండా అందరు ప్రేక్షకుల్ని మెప్పించింది

ఈ తరుణంలో లోకేశ్‌ కనకరాజ్‌ క్రియేట్ చేసి సినిమాటిక్‌ యూనివర్స్‌ గురించి మరింతగా చర్చ జరిగింది

‘విక్రమ్‌’ తర్వాత విజయ్‌ హీరోగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు లోకేశ్‌ కనకరాజ్

‘దళపతి 67’గా పట్టాలెక్కుతున్న ఆ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది

14 ఏళ్ల తరువాత విజయ్‌ - త్రిషలు మళ్లీ కలిసి నటిస్తున్న చిత్రమిది

సంజయ్‌దత్‌, ప్రియా ఆనంద్‌, అర్జున్‌ సర్జా, గౌతమ్‌ మేనన్‌, మిస్కిన్‌, మన్సూర్‌ అలీఖాన్‌, మాథ్యూ థామస్‌ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు

ఎస్‌.ఎస్‌.లలిత్‌కుమార్‌ 7 స్క్రీన్‌ స్టూడియో బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు