నాలుగేళ్ల గ్యాప్ తర్వాత పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు షారుఖ్.
జనవరి 25న విడుదలైన ఈ సినిమా తొలి రోజే రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టింది
ఈ సినిమా డిజిటల్ రైట్స్ను అమెజాన్ ప్రైం వీడియోస్ భారీ ధరకు సొంతం చేసుకుందట.
ఇందుకోసం ఏకంగా రూ.100 కోట్లకు పైగానే చెల్లించారట చిత్రబృందానికి..
థియేటర్లో రిలీజైన మూడు నెలలకు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలతో అమెజాన్ ఒప్పందం చేసుకుందట.
అంటే ఏప్రిల్ 25న పఠాన్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు.