షారుఖ్‌ఖాన్‌, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం పఠాన్‌.

సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన ఈ మూవీలో జాన్‌ అబ్రహం విలన్‌గా నటించాడు

జనవరి 25న విడుదలైన పఠాన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

18 రోజులకు గానూ పఠాన్‌ సినిమాకు రూ.950 కలెక్షన్లు  వచ్చాయి.

త్వ‌ర‌లోనే  వేయి కోట్ల క్ల‌బ్‌లో చేరుతుంద‌ని ట్రేడ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

 వాలంటైన్స్‌డే రావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.

కాగా నాలుగేళ్ల తర్వాత పఠాన్ సినిమాతో మన ముందుకొచ్చాడు షారుఖ్‌.