బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది.

మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. కలెక్షన్స్‌లోనూ కొత్త రికార్డులు నమోదు చేస్తోంది.

స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమాలో దీపికా పదుకొణె, జాన్‌ అబ్రహం కీలక పాత్రలు పోషించారు.

మొదటి రోజు రూ.106 కోట్ల గ్రాస్ వసూల్ చేసిన ఈ సినిమా.. రెండో రోజు జోరును కొనసాగించింది.

 రెండో రోజు కూడా పఠాన్‌కు రూ. 100 కోట్లకు పైనే గ్రాస్ వచ్చిందంటున్నారు ట్రేడ్ నిపుణులు

రూ.200 కోట్ల క్లబ్‌లో పేరిన పఠాన్‌  ఈ వీకెండ్‌కు రూ. 400 కోట్లు వసూల్‌ చేసే అవకాశం ఉందట

పఠాన్  సినిమాను సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించగా యష్‌ రాజ్‌ సంస్థ  నిర్మించింది.