టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక తన ఆటకు గుడ్‌బై చెప్పబోతున్నట్టు వెల్లడించింది.

ఫిబ్రవరిలో జరగనున్న దుబాయ్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌ షిప్‌ తర్వాత.. రిటైర్‌మెంట్‌ ప్రకటించబోతున్నట్టు తెలిపారు సానియా మీర్జా.

ఐతే గతేడాది US ఓపెన్‌ తర్వాతే తన ఆటకు వీడ్కోలు చెప్పాలనుకున్నారు.

కానీ గాయంతో ఆ టోర్నమెంట్‌లో ఆడలేకపోవడంతో తన రిటైర్‌మెంట్‌ నిర్ణయాన్ని మార్చుకుంది సానియా.

తాజాగా టెన్నిస్‌కు గుడ్ బై చెప్పడానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయంటూ కీలక ప్రకటన చేసింది.

ఫిబ్రవరిలో దుబాయ్‌ వేదికగా జరిగే WTA టోర్నీతో తన కెరీర్‌ను ముగించనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది సానియా.