సందీప్‌కిషన్‌ హీరోగా దివ్యాంశ కౌశిక్‌ కధానాయకిగా తెరకెక్కుతున్న చిత్రం  ‘మైఖేల్‌’

రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహిస్తున్నా ఈ మూవీని భరత్‌ చౌదరి, పూస్కూర్‌ రామ్మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు

విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ మేనన్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి

దక్షిణాది భాషలతోపాటు, హిందీలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు

ఫిబ్రవరి 3న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మంగళవారం మూవీ మేకర్స్ ప్రకటించారు

‘‘సందీప్‌ కిషన్‌ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రమిది. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలు, ‘నువ్వుంటే చాలు...’ గీతం సినిమాపైన ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయ’’ని చిత్ర బృందం తెలిపింది