సమంత.. గత కొంతకాలంగా వార్తల్లో తరచుగా వినిపిస్తోన్న పేరు. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత.. చికిత్స తీసుకుంటూనే సినిమాలు చేస్తోంది

తాజాగా సమంత నటించిన శాకుంతలం ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతోంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇంటర్వ్యూలు ఇస్తూ.. వస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను తొలి సారిగా వెల్లడించింది.

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ..”నేను వివాహ బంధంలో ఎంతో నిజాయితీగా ఉన్నాను. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అందుకు విడాకులు తీసుకున్నాం.

ఆ తర్వాత నాకు స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చింది.

 ఈ సాంగ్ ఆఫర్ గురించి కొంత మంది నాతో.. విడాకులు తీసుకున్న కొన్ని రోజులకే నీకు ఐటెం సాంగ్స్ ఎందుకు ఇంట్లో కూర్చోకుండా అంటూ మాట్లాడారు”

ఆ ఐటెం సాంగ్ ఇంకేదో కాదు పుష్ఫ సినిమాలో ఊ అంటావా.. మావా ఊహు అంటావా మావా పాటే. ఈ ఒక్క పాటలో సమంత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.