కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా ఓ మాస్‌ యాక్షన్‌ చిత్రం తెరకెక్కువుతున్న విషయం తెలిసిందే.

జనతా గ్యారేజ్ లాంటి విజయం తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ చిత్రం షూటింగ్  జరుగుతోన్న సంగతి తెలిసిందే.

కాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్‌ కథానాయకుడు సైఫ్‌ అలీఖాన్‌ తాజాగా సెట్లోకి అడుగుపెట్టారు.

దీని సంబంధిన ఫొటోలను సోషల్ మీడియాలో చిత్రబృందం పంచుకుంది.

ఓ సముద్ర తీర ప్రాంతం నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ శక్తిమంతమైన పాత్రలో మెప్పించనున్నారు.

ఎన్టీఆర్‌కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.