ఓ పక్క సాయి పల్లవి సినిమాల నుంచి తప్పుకుంటున్నారంటూ.. సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరో పక్క బాలీవుడ్ లో ఓ క్రేజీ సినిమా చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.

వెరసి అటు సాయి పల్లవి ఫ్యాన్స్‌తో పాటు ఇటు ఫిల్మ్ లవర్స్‌ ను కూడా తికమక పెడతున్నాయి.

ఎస్! ఇప్పటికే తనను తాను వర్సటైల్ యాక్టరస్గా ప్రూవ్‌ చేసుకున్న సాయి పల్లవి.

తాజాగా దిమ్మతిరిగే సినిమా ఛాన్స్ కొట్టేసిందనే న్యూస్ బీ టౌన్‌లో వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా..

రామాయన గాథ తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో సీత క్యారెక్టర్ కోసం సౌత్ బ్యూటీ సాయి పల్లవిని తీసుకున్నారనే పక్కా న్యూస్ను బీటౌన్ బయటపెట్టింది.