శైలేష్‌ కొలను దర్శకత్వంలో వచ్చిన ‘హిట్‌’ చిత్రంలో కథానాయికిగా కనిపించింది రుహానిశర్మ.

అయితే ఆమె ‘సైంధవ్‌’లోనూ ఓ కథానాయికిగా చేస్తున్న సంగతి తెలిసిందే.

వెంకటేష్‌ హీరోగా శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్న చిత్రమిది.

శ్రద్ధాశ్రీనాథ్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.

కాగా ఈ చిత్రం నుంచి శుక్రవారం రుహాని ఓ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం.

ఈ చిత్రంలో డా.రేణుగా కనిపించనుంది రుహాని.

ప్రస్తుతం విశాఖపట్నంలో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.

ఈ ఏడాది డిసెంబరు 22న దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ  ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.