మారుతోన్న జీవనశైలి, తీసుకునే ఆహారం కారణం ఏదైనా ఇటీవల రోగాల బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది

ముఖ్యంగా ఈ సాంకేతిక యుగంలో కాలు తీసి బయట పెట్టే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది

తీసుకున్న ఆహారానికి తగ్గ శారీరకశ్రమ లేకపోవడం దాదాపు ఉద్యోగాలన్నీ కూర్చొని చేసే కావడంతో అనారోగ్యం బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది

ఇలా వేధిస్తోన్న సమస్యల్లో పక్షవాతం ఒకటి. యంగ్ ఏంజ్‌లో ఉన్నప్పుడు సరైన శారీరక శ్రమ లేకపోవడంతో వయసు పెరిగిన తర్వాత ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి

అయితే భవిష్యత్తులో పక్షవాతం బారిన పడకూడదంటే వెంటనే నడక ప్రారంభించాలని చెబుతున్నారు శాస్త్రవేత్తలు

రోజులో కనీసం ముప్పై నిమిషాలు నడవడం వల్ల పక్షవాత ప్రమాదం సగానికి సగం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది

వారానికి కనీసం మూడు గంటలు నడిచే మహిళల్లో 43 శాతం మంది పక్షవాత ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడతారని పరిశోధనల్లో వెల్లడైంది

చూశారుగా నడక ఎంత మేలు చేస్తుందో. మరెందుకు ఆలస్యం వెంటనే బైక్‌లను పక్కన పట్టి నడక ప్రారంభించండి