వరుణ్‌తేజ్‌ హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాంఢీవధారి అర్జున’.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్  పై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశ చిత్రీకరణలో ఉంది.

వరుణ్‌తేజ్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రమిది.

ఈ చిత్రంలో వరుణ్‌కి జోడిగా సాక్షి వైద్య నటిస్తుంది.

తాజా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు మూవీ మేకర్స్.

ఈ చిత్రం ఆగష్టు 25ని ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ ను షేర్ చేసింది చిత్రబృందం.

గాఢతతో కూడిన ఓ బలమైన పాత్రలో వరుణ్ ఈ చిత్రంలో కనిపించనున్నారు.

ఈ చిత్రంలో యాక్షన్‌ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయిని సినీ వర్గాలు తెలిపాయి.