5 నెలల తర్వాత రీఎంట్రీ.. 7 వికెట్లతో రచ్చ.. ఆసీస్‌కు డేంజర్ సిగ్నలిచ్చిన భారత స్టార్ బౌలర్..

దాదాపు 5 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా, ఎట్టకేలకు మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చాడు.

రంజీ ట్రోఫీలో బరిలోకి దిగిన జడేజా.. తొలి రెండు ఇన్నింగ్స్‌ల్లో పూర్తిగా విఫలమయ్యాడు.

తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన జడేజా మొత్తం 24 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు.

సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న అతను కేవలం 15 పరుగులకే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.

తమిళనాడు రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 17.1 ఓవర్లలో 53 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.

మోకాలి గాయం కారణంగా రవీంద్ర జడేజా చాలా కాలంగా మైదానానికి దూరంగా ఉన్నాడు.

అతను చివరిసారిగా ఆగస్టు 2022లో క్రికెట్ ఆడాడు.

ఆసియా కప్ మధ్యలో అతను టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌ కూడా ఆడలేకపోయాడు.

ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 9న ప్రారంభమయ్యే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మొదటి 2 టెస్టుల కోసం భారత జట్టులో చేరాడు.

ఈ సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు రవీంద్ర జడేజా రంజీ మ్యాచ్‌లు ఆడుతున్నాడు.

ఇక్కడ తిరిగి ఫాంలోకి రాకుంటే ప్లేయింగ్-11లో ఆడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.