TV9 Telugu

క్రేజ్ పెరిగింది.. రెమ్యూనరేషన్ పెంచింది.. 

22 April 2024

 చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ సొంతం ఛేసుకుంది అందాల భామ రష్మిక మందన్న. 

కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 

ఆతర్వాత గీతగోవిందం సినిమాతో హిట్ అందుకుంది. గీతగోవిందం సినిమాలో విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. 

ఆతర్వాత ఈ బ్యూటీకి బడా సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. మహేష్ బాబు నటించిన సరిలేరూ నీకెవ్వరు సినిమాలో నటించింది. 

ఇక పుష్ప సినిమాతో ఓ రేంజ్ లో హిట్ అందుకుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యింది రష్మిక మందన్న. 

తెలుగుతో పాటు, తమిళ, హిందీ బాషాల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇటీవలే యనిమాల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది.

అయితే యానిమాల్ సినిమా తర్వాత రష్మిక క్రేజ్ డబుల్ అయ్యింది. దాంతో ఈ అమ్మడు భారీగా డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది.