మరో వివాదంలో రష్మిక.. ఈసారి ఏకంగా దక్షిణాది పై కామెంట్స్

గడిచిన ఆరు నెలల నుంచి వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు కన్నడ బ్యూటీ రష్మిక

తనకు తొలి అవకాశాన్ని ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు చెప్పకపోవడంతో ఇటీవల విమర్శలు ఎదుర్కొన్న ఆమె తాజాగా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.

సిద్ధార్థ్‌ మల్హోత్ర - రష్మిక జంటగా నటించిన సరికొత్త బాలీవుడ్‌ చిత్రం ‘మిషన్‌ మజ్ను’. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉండగా తాజాగా ‘మిషన్‌ మజ్ను’ నుంచి ఓ పాట విడుదల వేడుకలో పాల్గొన్నారు రష్మిక.

‘చిన్నప్పటి నుంచి నా దృష్టిలో రొమాంటిక్‌ సాంగ్స్‌ అంటే బాలీవుడ్‌ పరిశ్రమే గుర్తుకువస్తుంది. ఇక్కడ ఎన్నో రొమాంటిక్‌ పాటలు తెరకెక్కి.. ప్రేక్షకుల్ని అలరించాయి.

ఇక దక్షిణాదిలో చూసుకుంటే డ్యాన్స్‌తో కూడిన మాస్‌ మసాలా, ఐటమ్స్‌ సాంగ్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇది నా తొలి బాలీవుడ్‌ రొమాంటిక్‌ సాంగ్‌ అని తెలిపారు

దక్షిణాదిలోనూ ఎన్నో రొమాంటిక్‌ పాటలు ఉన్నాయి. ముందు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు

మిమ్మల్ని పరిచయం చేసింది కన్నడ పరిశ్రమ. తెలుగులోకి వచ్చాక ఇక్కడ ఫేమ్‌ రాగానే.. కన్నడ పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడారు.

ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అక్కడ ఫేమ్‌ పొందడం కోసం దక్షిణాది పరిశ్రమనే తప్పుపడుతున్నారు’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు