కమల్హాసన్తో ‘భారతీయుడు-2’.. రామ్చరణ్తో ‘గేమ్ ఛేంజర్’ సమాంతరంగా పూర్తి చేస్తున్నారు దర్శకుడు శంకర్.
ప్రస్తుతం ఈ రెండు సినిమాలు కూడా ముగింపు దశలో ఉన్నాయి.
ఇటీవలే ‘భారతీయుడు2’ కొత్త షెడ్యూల్ను దక్షిణాఫ్రికాలో ప్రారంభించింది చిత్రబృందం.
తాజాగా ఈ షెడ్యూల్ షూట్ పూర్తయినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు శంకర్.
ఈ సందర్భంగా చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ గురించి అప్డేట్ ఇచ్చారు.
ఈ చిత్రం క్లైమాక్స్ చిత్రీకరణను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
ఈ చిత్రంలో రామ్చరణ్కు జోడిగా కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.