రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇక అది అలా ఉంటే ఆయన మరో సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది.

మఫ్టీ చిత్రంతో కన్నడ చిత్రసీమలో మంచి పేరు తెచ్చుకున్న నర్తన్ తో రామ్ చరణ్ ఓ చిత్రాన్నియనున్నారట. 

అందులో భాగంగా ఇప్పటికే నర్తన్, రామ్ చరణ్‌కి పూర్తి స్క్రిప్ట్‌ను వినిపించడం.. చరణ్ ఓకే చెప్పడం జరిగిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. 

మాంచి యాక్షన్ అడ్వెంచర్‌‌గా ఉండనుందట ఈ సినిమా. ఈ విషయంలో అతి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఇక రామ్ చరణ్  ఇతర సినిమాల విషయానికి వస్తే.. శంకర్‌తో కలిసి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తోన్నసంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. 

దిల్ రాజు నిర్మిస్తున్నారు.. కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తున్నారు. కొన్నాళ్లు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన టీమ్ ఇక షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది