తెలుగులో దాదాపు అందరూ స్టార్‌ హీరోలతో జతకట్టి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలు తన ఖాతాలో వేసుకుందీ రకుల్.

బాలీవుడ్‌, కోలీవుడ్‌ చిత్రాల్లోనూ నటించినా ఈ భామకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి.

ముఖ్యంగా తమిళంలో అయితే మొదటి నుంచి విజయం కోసం పోరాడుతూనే ఉంది.

కార్తీ సరసన నటించిన ధీరన్‌ అధికారం ఒండ్రు (తెలుగులో ఖాకీ) చిత్రంతో తమిళంలో విజయాన్ని అందుకుంది.

ఇదిలా ఉంటె మాస్‌ మసాలా కథా పాత్రల కోసం వెయింటింగ్‌ అని చెబుతుంది ఈ వయ్యారి.

ప్రస్తుతం కమలహాసన్‌కు జోడిగా భారతీయుడు 2, శివ కార్తికేయన్‌కు సరసన అయిలాన్‌ చిత్రలలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌  మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను కథలను ఎంపిక చేసుకోవడంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంది.

మాస్‌ మసాలా కథాంశం కలిగిన చిత్రాల్లోనూ నటించాలని కోరుకుంటున్నానంది.

తనలోని నటన ప్రతిభను చాటుకోవడానికి ఛాలెంజింగ్‌ పాత్రల్లో నటించడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.