పాన్‌ ఇండియా చిత్రం పుష్పను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకం నుంచి వస్తున్న తాజా చిత్రం 'సత్తిగాని రెండు ఎకరాలు'. అమ్ముతడా? సస్తడా? అనేది ఉపశీర్షిక

ఈ చిత్రంలో పుష్ప ఫేమ్‌ జగదీశ్‌ భండారి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు

కొల్లూరు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌ సహా పలువురు నటీనటులు ముఖ్య పాత్రల్లో నటించారు

ఇది మైత్రీ మూవీ మేకర్స్‌కు  తొలి తెలుగు ఓటీటీ చిత్రం

తాజాగా ఈ  చిత్రం ఓటీటీ విడుదల తేదీ ప్రకటించారు మూవీ మేకర్స్

ఈ చిత్రం మార్చి 17 నుంచి  ఆహా వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపింది చిత్రబృందం

మంచి కామెడీ చిత్రం ఇష్టపడేవాళ్లు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్న 'సత్తిగాని రెండు ఎకరాలు' చూసి ఆస్వాదించేయండి