స్టోరీని రెండు పార్ట్ లగా చెప్పడం ఇండస్ట్రీలో ఓ కొత్త ట్రెండ్
‘బాహుబలి’ నుంచి ఇలాంటి ప్రయత్నాలు విజయవంతంగా నడుస్తున్నాయి
ఇదే బాటలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తీసుకొచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తుంది
ఆ దిశగా మూవీ యూనిట్ ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం
ఈ విషయంపై గురించి మాత్రం చిత్రబృందం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు
నాగ్ అశ్విన్ దర్శత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎవరూ స్పృశించని కథతో.. అత్యాధునిక హంగులతో తెరకెక్కిస్తున్నారు
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోణె హీరోయిన్ గా నటిస్తుంది
ఈ చిత్రంలో కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారు