టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వరుస హిట్ సినిమాలతో వావ్ అనిపిస్తున్నారు.

తాజాగా వారసుడు‌తో , వేణు టిల్లు దర్శకత్వంలో వచ్చిన బలగం అనే సినిమాతో మరో మంచి విజయాన్ని అందుకున్నారు.

ఇక అది అలా ఉంటే దిల్ రాజు త్వరలో రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు లేటెస్ట్ టాక్.

అందులో భాగంగానే నిజమాబాద్ ఏరియాలో కలివిడిగా తిరుగుతూ.. సామాజిక కార్యక్రామాల్లో పాల్గోంటున్నారని..

పక్కా ప్లానింగ్‌తో రానున్నారని.. తెలుస్తోంది. ఈ విషయంలో టాలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిబడుతున్నాయి.

ఆ పుకార్ల ప్రకారం దిల్‌ రాజు నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలనున్నారని అంటున్నారు. మరో పక్క అలాంటేదేమి ఉండదని.. ఆయన డైరెక్ట్‌గా రాజ్యసభకు వెళ్తారని అంటున్నారు.

అయితే ఇవి జస్ట్ రూమర్సేనా.. లేక నిజమా అనేది తెలియాలంటే.. మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.