ఒకప్పుడు వెండితెరపై తనదైన ముద్ర వేసిన అందాల భామల్లో ప్రియమణి(Priyamani)ఒకరు.

పెళ్లయిన కొత్తలో సినిమాతో జగపతి బాబుకు జోడీగా నటించి ఎన్టీఆర్ యమదొంగ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ సినిమా తర్వాత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. అలాగే తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ భామ.

పెళ్లి తర్వాత సినిమాల్లో స్పీడ్ తగ్గించింది. కొత్త అందాలు ఎంటర్ అవ్వడంతో ఈ అమ్మడికి ఛాన్స్ లు తగ్గాయనే చెప్పాలి.

అయితే ఈ అమ్మడు కెరీర్ బిగినింగ్ లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను తాజాగా గుర్తు చేసుకుంది. 

ఓ సినిమా షూటింగ్ జరుగుతుండగా..  సన్నివేశంలో నాభిని చూపించే సన్నివేశం ఉందని.. నాభి దగ్గర టాటూ చూపిస్తూ ఆ సీన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు.

అయితే ముందుగా నాకు దాని గురించి చెప్పలేదు. అయినా సరే నేను చేశాను.. అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి. 

నిజానికి హీరోయిన్స్ సన్నివేశానికి తగ్గట్టుగానే అందాలను చూపిస్తారు. కొన్నిసార్లు ఇష్టం లేకుండా ఇలా అందాలు చూపిస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు.