అభిమానులను ముద్దుగా డార్లింగ్స్‌ అని పిలుస్తూ జోష్‌ నింపే హీరో ప్రభాస్‌.

ప్రభాస్‌ తాను పాల్గున్న ప్రతి వేడుకలో 'హాయ్ డార్లింగ్స్‌' అంటూ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు.

అయితే ‘ఆదిపురుష్‌’ విషయంలో అలా పిలవనని ఫ్యాన్స్‌కు తెలిపారు.

దానికి బదులుగా ‘జై శ్రీరామ్‌’ అనే మాటతో తన స్పీచ్ మొదలుపెట్టారు ప్రభాస్.

సోమవారం హైదరాబాద్‌ ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో నిర్వహించిన ఆదిపురుష్‌ సినిమా ట్రైలర్‌ ప్రదర్శన తర్వాత ఆయన మాట్లాడారు.

కొందరు ఫ్యాన్స్ డార్లింగ్‌.. డార్లింగ్‌ అంటూ హోరెత్తిస్తే.. మరికొందరు జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేసారు.

కాగా ఈ చిత్రం రిలీజ్ అయ్యేవరకు 'జై శ్రీరామ్’ అందామని ప్రభాస్ ఫ్యాన్స్‌కు తెలిపారు.

‘ఆదిపురుష్‌’ చిత్రం జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.