ఒకప్పుడు లక్కీ హీరోయిన్స్ ఇప్పుడు బ్యాడ్ లక్ సఖీ అను పేరుతెచ్చుకుంటున్నారు. ఎడాది చాలా మంది హీరోయిన్ల పరిస్ధితి అదే.

ఈ లిస్ట్ లో అందాల భామ పూజాహెగ్డే కూడా ఒకరు. ఈ ఏడాది పూజకు అంతగా కలిసి రాలేదు.

స్టార్ హీరోల సినిమాల్లో నటించినా అవి డిజాస్టర్స్ గా మిగిలాయి.అలోమోస్ట్ అన్ని సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి.

ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లో చేసిన సర్కస్ సినిమా పైనే ఆశలు పెట్టుకుంది. రణవీర్ సింగ్ హీరోగా నటించారు.

తాజాగా పూజ హెగ్దే మాట్లాడుతూ.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది.

పూజ నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ ఈ చిన్నదానికి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. దాంతో పూజా రెమ్యునరేషన్ పెంచేసిందని ప్రచారం జరిగింది.

దీనిపై పూజ స్పందిస్తూ.. రేమ్యూనరేషన్ కోసం నిర్మాతలను తాను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని చెప్పుకొచ్చింది.

నేను రెమ్యూనరేషన్ పెంచానని అందరూ అనుకుంటున్నారు.. నిజానికి నేను ఎలాంటి రెమ్యూనరేషన్ పెంచలేదని నిర్మాతల దగ్గర అడ్వాన్సులు కూడా తీసుకోలేదని తెలిపింది.

రెమ్యునరేషన్ కోసమే ఇండస్ట్రీలోకి వచ్చి ఉంటే ఇప్పుడు నేను చాలా సినిమాలు కమిట్ అయ్యి ఉండేదాన్ని.. కానీ నేను డబ్బుకోసం ఇండస్ట్రీలోకి రాలేదు అని అంది పూజాహెగ్డే.