బంగారు-వెండి నాణేలు, వజ్రాల నగలు వగైరా అపార విలువైన గుప్త నిధుల గురించి చందమామ కథల్లో, ఆలీబాబా నలభై మంది దొంగల కథల్లో విని వుంటారు

ఐతే ఇలాంటి గుప్త నిధులు నిజంగానే భూమిపై ఉన్నాయని మీకు తెలుసా? ఐతే ఇప్పటి వరకు ఆ నిధులను ఎవరూ కనుగొనలేకపోయారు

ప్రపంచంలో ఇలాంటి మర్మమైన నిధులు, వాటి నెనుక దాగి ఉన్న మిస్టరీలు మీకోసం

1782లో గ్రోస్వెనార్ అనే మద్రాసు ఓడ కోట్లాది విలువైన నిధితో సహా దక్షిణాఫ్రికా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఓడ, నిధి నేటికీ ఎవ్వరికీ చిక్కలేదు

బీహార్‌లోని రాజ్‌గిర్‌లో సోన్ భండార్ అనే గుహలో మగధ చక్రవర్తి బింబిసారుడు దాచిన నిధి ఉందని అందరూ అనుకుంటున్నారు

జేన్ లాఫిట్, అతని అన్న పియరీ అనే సముద్రపు దొంగలు గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఓడలను దోచుకోవడం ద్వారా అపారమైన సంపదను పోగు చేశారట

కానీ హఠాత్తుగా అతను మరణించాడు. దీంతో అతను దాచిన ఖజానా ఎక్కడుందో ఇప్పటికీ అంతుచిక్కలేదు

ఓక్ దీవిలో కోట్ల విలువ చేసే నిధి దాగి ఉంది. ఆ మర్మమైన నిధిని నేటికీ ఎవరూ కనుగొనలేకపోయారు