పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి ‘వినోదాయ సిథం’ రీమేక్లో నటిస్తున్న విషయం తెలిసిందే
వీరిద్దరూ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు
ఫాంటసీ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ దేవుడిగా నటిస్తుండగా.. సాయిధరమ్ తేజ్ ఆయన భక్తుడిగా నటిస్తున్నారు
కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది
ఈ చిత్రంలో బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రోహిణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది
శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం
త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు మూవీ మేకర్స్