తాజాగా పద్మ పురస్కారాలకు ఎంపికైన వారి పేర్లు విడుదల చేసిన విషయం తెలిసిందే

అందులో మన తెలుగువారు కూడా ఉన్నారు

ఈ విషయమై జనసేనాని పవన్ ఓ ట్వీట్ చేసారు

అందులో పవన్ ఈ విధంగా పేర్కొన్నారు

పద్మ  అవార్డులకు ఎంపికైన తెలుగు వారికి జనసేనని పవన్‌ కళ్యాణ్‌ అభినందనలు చెప్పారు

ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామి, ఆధ్యాత్మిక గురువు కమలేశ్‌ డి.పటేల్‌ను పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది అన్నారు

అలాగే ఎంఎం కీరవాణి, డా.సంకురాత్రి చంద్రశేఖర్‌, బి.రామకృష్ణారెడ్డికి పద్మశ్రీ పురస్కారం పొందడం  ఆనందాయకం అన్నారు పవన్

అవార్డులు పొందిన మిగిలిన వారికి కూడా ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు పవన్ కళ్యాణ్