గేల్‌, కోహ్లీ రికార్డులు బ్రేక్.. తొలి క్రికెటర్‌గా పాక్ సారథి..

పొట్టి ఫార్మాట్‌లో పాకిస్తాన్ సారథి సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు.

అత్యంత వేగంగా 9000 పరుగులు చేసి క్రిస్‌గేల్‌, విరాట్‌ కోహ్లీ రికార్డులను బ్రేక్ చేశాడు.

పాకిస్థాన్‌ సూపర్‌లీగ్‌‌లో ఈ రికార్డును పూర్తి చేశాడు.

పెషావర్‌ జల్మీ తరపున బాబర్‌ అజాం గురువారం 64 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

దీంతో కేవలం 245 ఇన్నింగ్స్‌లోనే 9000ల పరుగులు పూర్తి చేశాడు.

ఈ ఫీట్‌తో ఫస్ట్ ఫాస్టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

విండీస్ మాజీ ప్లేయర్ క్రిస్‌గేల్ 249 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ చేరుకున్నాడు.

టీమిండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ 271 ఇన్నింగ్స్‌లో 9వేల పరుగులను చేరుకున్నాడు.

డేవిడ్‌వార్నర్‌ 273 ఇన్నింగ్స్‌‌లో చేరుకోగా, ఆరోన్‌ ఫించ్‌ 281 ఇన్నింగ్స్‌లతో ఈ మైలురాయిని చేరుకున్నారు.