విరాట్ ఈ రికార్డులను ఢీకొట్టే వారు లేరు..
విరాట్ తన T20 అంతర్జాతీయ అరంగేట్రం 12 జూన్ 2020న జింబాబ్వేపై ఆడగా, 20 జూన్ 2011న టెస్ట్ అరంగేట్రం చేశాడు.
విరాట్ కోహ్లీ ఈ 14 ఏళ్లలో మూడు ఫార్మాట్లలో కలిపి 23,726 అంతర్జాతీయ పరుగులు చేశాడు.
ఈ కాలంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఈ 14 ఏళ్లలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా జో రూట్ (17,566 పరుగులు) నిలిచాడు.
విరాట్ ఇప్పటివరకు 70 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. గత 14 ఏళ్లలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా కూడా నిలిచాడు. కోహ్లీ తర్వాత హమీష్ ఆమ్లా రెండో స్థానం(50)లో ఉన్నాడు.
విరాట్ తన అంతర్జాతీయ కెరీర్లో 57 సార్లు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు.
ఈ 14 ఏళ్లలో అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచిన ఆటగాడు కూడా కోహ్లీదే అగ్రస్థానం. ఆ తర్వాత రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ 35 సార్లు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు.